The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మహబూబ్నగర్ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఒకటి.మరియు జిల్లా ముఖ్యపట్టణం.మహబూబ్ నగర్ జిల్లా ను పాలమూర్ అని కూడా పిలుస్తారు . ఇది హైదరాబాదునుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, ఉత్తరమున రంగారెడ్డి జిల్లా, పశ్చిమమున కర్ణాటక లోని రాయచూరు, గుల్బర్గా జిల్లాలు ఉన్నాయి.
మహా సముద్రం (ఓషన్) వంటి అధికమొత్తంలో నీరు శీఘ్ర స్థానభ్రంశం జరగడం వల్ల ఒక టిసునామి (津波) సముద్రపు కెరటం (అలలు) పరంపర ఆరంభమవుతుంది నీటి పై గాని క్రింద గాని భూకంపాలు (భూకంపం ), సమూహపు కదలిక (మాస్ మూవ్మెంట్ ), కొన్ని అగ్నిపర్వత విస్ఫోటనములు (అగ్నిపర్వత విస్పోటనం ) మరియు కొన్ని జలాంతర్భాగ విస్ఫోటనం (అండర్ వాటర్ అక్స్ప్లోషంస్ ) , భూఫలక జారుడు (లాండ్ స్లైడ్), నీటి కింది భూకంపం (భూకంపం ), అతిపెద్ద గ్రహ శకలము (అస్ట్రాయ్డ్ ఇంపాక్ట్ ), భూకంపాలు అణు ఆయుధం (న్యూక్లియర్ వీపన్) విస్ఫోటనములు సునామిని పుట్టించగలవు అతి ఎక్కువ నీరు మరియు శక్తి కలిగి వుండటం వలన, సునామీలు మహా ధ్వంసాలకి దారి తీయగలవు. ప్రాచీన యునానీ (గ్రీసు) (గ్రీక్) చరిత్రకారుడైన తుసైడిడీజ్(తుసిడీస్) మొట్టమొదటి సారిగా సునామీను జలాంతర్గామి ప్రకంపనములకు ముడి పెట్టాడు కాని సునామీని అర్ధంచేసుకోవడం 20వ శతాబ్దము వరకు శూన్యంగానే ఉంది మరియు ఇప్పటికి సునామీ మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అనేక పూర్వపు భౌగోళిక, భూగర్భ, సాగర శాస్త్ర మొదలైనవి చెప్పిన "సెసిమిక్ సముద్రపు అలల నే ఇప్పుడు సునామీగా వ్యవహరిస్తున్నారు కొన్ని భూగర్భవాతావరణ (మెటియోరోలాజికల్) తుఫాను (స్ట్రోం) పరిస్థుతులు - తీవ్ర వాయుగుండములు (డిప్రెషంస్) తుఫానులు (సైక్లోంస్), పెను తుఫానుకు (హరికేంస్) కారణ్మవుతాయి - ఇవి ఉప్పొంగు తుఫానును (ఉప్పెన)(స్ట్రోం సర్జ్) ఉత్పత్తి చేస్తుంది. ఇది సహజ కెరటముల కంటే కొన్ని మీటర్ల ఎత్తు ఉంటాయి దీనికి కారణం వాయుగుండం మధ్యలో తక్కువ వాతావరణ పీడనం (అట్మోస్ఫెరిక్ ప్రెషర్).ఈ విధంగా ఉప్పొంగే తుఫానులు (స్ట్రోం సర్జెస్ ) తీరాన్ని తాకి, అవి సునామీ అని భ్రమను కల్పించి, అధిక భూబాగాన్ని ముంచెత్తుతాయి.
శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 - మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.
నిక్ వుజిసిక్ (Nick Vujicic) (జననం: 1982 డిసెంబరు 4) ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త. ఇతను ఫొకొమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్ళు, చేతులు లేకుండానే పుట్టాడు. ఇతను కాళ్ళు, చేతులు లేకపోయినా తండ్రి సాయంతో ఐదేళ్ల వయసులోనే ఈత నేర్చుకున్నాడు, అంతేకాకుండా సముద్రంపై సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. కే.శివ కుమార్ ద్వారా స్థాపించబడి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ వై.యస్.
సౌర శక్తి (ఇంగ్లీషు: solar power) సూర్యుడి కిరణాల నుండి వెలువడే శక్తి. పరమాణు శక్తి తప్ప మానవుడు ఉపయోగించే మిగతా శక్తి అంతా సూర్యుని నుంచే వస్తుందని మనకు తెలుసు. ప్రపంచంలో ఉండే బొగ్గు, నూనె, సహజవాయువు నిల్వలను సంగ్రహించి, సూర్యుడు రోజూ మనకు శక్తిని అందించే పరిమాణంలో వాడటం ప్రారంభిస్తే మూడు రోజులకు సరిపోతుందని శాస్త్ర జ్ఞులు అంచనా వేశారు.
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (ఆంగ్లం Nelson Rolihlahla Mandela, (18 జూలై, 1918 - డిసెంబర్ 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
ఘంటసాల వెంకటేశ్వరరావు ( డిసెంబర్ 4, 1922 - ఫిబ్రవరి 11, 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపథ్యగాయకులలో ప్రముఖుడు.
18 నుండి 19 వ శతాబ్ద మధ్యకాలంలో వ్యవసాయం, యాంత్రిక ఉత్పత్తి, గనుల త్రవ్వకం, రవాణా మరియు సాంకేతికతలలోని ప్రధాన మార్పులు ఆ కాలంలోని సాంఘిక ఆర్థిక మరియు సాంస్కృతిక పరిస్థితులపై గొప్ప ప్రభావాన్ని చూపిన కాలం పారిశ్రామిక విప్లవం గా పిలువబడుతుంది. ఇది యునైటెడ్ కింగ్డంలో ప్రారంభమై, అనతరం ఐరోపా, ఉత్తర అమెరికా, తుదకు ప్రపంచం అంతటా వ్యాపించింది. పారిశ్రామిక విప్లవం మానవ చరిత్రలో ఒక ప్రధాన మలుపుగా ఉంది; నిత్య జీవితంలో దాదాపు ప్రతి అంశము ఏదో ఒక విధంగా ప్రభావితమైంది.
సీతాకోకచిలుకలు (ఆంగ్లం Butterfly) ఒక అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు. ఇవి లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత metamorphosis చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.
దేవుడు అనగా సృష్టికర్త అనగా సృష్టిని సృష్టించిన వాడు,1))సర్వాంతర్యామి,2)నిష్కలంకుడు 3) మానవుల పాపాలను క్షమించే వాడు,4) నిజమైన మార్గాన్ని చూపించేవాడు,5)పాపములను క్షమించి స్వర్గాన్ని ఇచ్చేవాడు,,6)నడిపేవాడు,7)దేవుడు ఒక్కడే అతని పేరు ఒక్కటే,8)ఆధికాలమున ఒక్కడే దేవుడు అంతకాలము ఒక్కడే దేవుడు,9)ఎటువంటి పాపము లేనివాడు,10)పాపము చేయనివాడు11)జన్మ పాపము కర్మ పాపము లేనివాడు,12)సథ్యమును బోధించువాడు. దేవున్ని మరచి అనగా సృష్కకర్తను మరచి సృష్టిని పూజించుట వలన ఏమి లభము, సృష్టిని పూజించుట వలన అధి నిన్ను అజ్ఞానములొకి,పాపములోనికి తీసుకపొతుంది. "ఫ్ర్యాంకి" బొద్దు పాఠ్యం దేవుడు లేదా దైవం ని ఆస్తికులు విశ్వాన్ని సృష్టించి, నడిపేవాడు, అని నమ్ముతారు.ఏకేశ్వరోపాసకులు దేవుడు ఒక్కడే అంటారు.
హోమీ జహంగీర్ భాభా, FRS (30 అక్టోబర్ 1909 – 24 జనవరి 1966) ఒక భారతీయ అణు భౌతికశాస్త్రవేత్త, అతను భారత అణుశక్తి కార్యక్రమం అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహించారు మరియు భారతదేశం యెుక్క అణు కార్యక్రమం యెుక్క పితామహుడిగా భావించబడతారు. భాభా ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించారు, తద్వారా ఆయన దిన్షా మానెక్జీ పెటిట్, మహమ్మద్ ఆలీ జిన్నా, హోమీ K భాభా మరియు డోరబ్ టాటాతో సంబంధం కలిగి ఉన్నారు. ఆయన ఆరంభ విద్యను బొంబాయి పాఠశాలలో మరియు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు వద్ద పొందిన తరువాత, అతను మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యసించటానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యెుక్క కైస్ కళాశాలకు హాజరైనారు.
మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన డి.కె.అరుణ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు రెండూ రాజకీయాలలో పేరుపొందినవే. తండ్రి మరియు సోదరుడు ఇదివరకు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, మామ మరియు భర్త గద్వాల నుంచి ఎన్నికైనారు.
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం (కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం) తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నుండి సికిందరాబాదుకు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 24 కి.మీ. ల దూరంలో ఉంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission or UPSC ), పలు భారతీయ సివిల్ సర్వీసులలో నియామకాల కోసం పరీక్షలు నిర్వహించడానికి అధికారం ఇవ్వబడిన భారత్లోని ఒక రాజ్యాంగ విభాగం. భారత రాజ్యాంగం (XIV భాగం – యూనియన్ మరియు రాష్ట్రాలలోని సర్వీసులు - ఆర్టికల్ సంఖ్య 315 నుంచి 323 వరకు) కేంద్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అందిస్తుంది.
షాదీ ముబారక్ పథకం తెలంగాణ రాష్ట్రం లోని ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన యువతుల వివాహాల కోసం రూ. 1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు.
ఈ వ్యాసం భారత జాతీయ రాజధాని ప్రదేశం అయిన ఢిల్లీ మహానగరాన్ని గురించి. భారతదేశపు రాజధాని గురించిన వ్యాసం కోసం క్రొత్త ఢిల్లీ చూడండి. ఢిల్లీ (Delhi, హిందీ: दिल्ली ఉర్దూ: دیلی ) వ్యాసం ఆరంభంలో మూడు వేరు వేరు పదాలగురించి తెలుసుకోవాలి: భారతదేశం రాజధాని : క్రొత్త ఢిల్లీ నగరం జాతీయ రాజధాని ప్రదేశం (నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ): ఇది చట్టపరంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశం.
ప్రాకృతిక సంభోగం సంభవం కానప్పుడు, ఇతర అప్రాకృతిక సంభోగం ఇష్టం లేన్నప్పుడు, తృష్ణ తీరడానికి వెలసుబాటులో ఉన్న ఏకైక మార్గం స్వయంతృప్తి. దీనినే హస్తప్రయోగం అని కూడా అంటారు. మగవాళ్ళలో, హస్త ప్రయోగం ద్వారా స్కలనం జరిగినప్పుడు కలిగిన తృప్తి, స్త్రీలలో జి స్పాట్ గాని క్లిటారిస్ గాని ప్రేరేపింపబడి, భావప్రాప్తి (ఆర్గజం) కలిగి తృప్తి పొందడం జరుగుతుంది.
భారతదేశం ఆనకట్టలు మరియు జలాశయాలు జాబితా
ఈ పేజీ భారతదేశం లోని రిజర్వాయర్ మరియు ఆనకట్టలు రాష్ట్రాల వారీగా జాబితా చూపిస్తుంది '. ఈ జాబితాలో సరస్సులు కూడా కలిగి ఉంది. 2012 సం.
జోధా-అక్బర్ (హిందీ: जोधा-अकबर, ఉర్దూ: |دھا اکبر}}) ఇది ఒక భారతదేశవీరచరిత్ర సినిమా, దీనిని ఫిబ్రవరి 15, 2008 న విడుదల చేసారు. ఈ సినిమాకు దర్శకత్వం మరియు నిర్మాత అశుతోష్ గోవరికేర్, ఈ దర్శకుడు లగాన్ సినిమాకి అకాడమీ అవార్డుకు నామినేట్ అయినాడు. ముఖ్య పాత్రలలో హ్రితిక్ రోషన్ మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించారు.