The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి) ).this was written by aurangzeb himself,that iam presently born as hindu yes i tell hinduism is great and it is santana dharma,yes aurangzeb killed shambaji,but aurangzeb was mind controlled by lord shiva and hindu gods to kill shambaji,that means lord shiva himself killed shambaji without lord shiva permission there is nothing happened in this world and earth, shivudi agna lenidhe chimaina kuttadu,this is hindu philosophy,lord shri krishna said in bhagavadgita,that with his permission and with his will that both sides are doing war, gods have superpowers that they do anything in this world nothing is impossible to them ,aurangzeb is good person,he was mind controlled by hindu gods themselves,but finally who is the winner is aurangzeb, because in my next birth aurangzeb was born to lord shiva and parvati this was written by potuluri veerabrahmendra swamy himself and he compared me and my wife to lord shiva and parvati,this was said to me by hindu gods themselves,here bad person was hindu gods but not aurangzeb, and aurangzeb was victim that hindu gods mind controlled him ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది.
యావజ్జీవ కారాగారశిక్ష అనగా తీవ్రమైన నేరం కింద దోషిగా నిర్ధారించబడిన వ్యక్తికి జీవితాంతం లేదా పెరోల్ (గరిష్ఠ శిక్ష కాలం పూర్తి కాక ముందే షరతులతో కూడిన పూచీకత్తుపై ఖైదీ తాత్కాలిక విడుదల) వరకు జైలులో ఉండేలా విధించబడే జైలు శిక్ష. యావజ్జీవ కారాగారశిక్షను యావజ్జీవ శిక్ష, జీవిత ఖైదు, యావజ్జీవ ఖైదు అని కూడా అంటారు. హత్య, హత్యాయత్నం, కఠినంగా పిల్లలను వేధించడం, అత్యాచారం, గూఢచర్యం, దేశద్రోహాం, డ్రగ్ డీలింగ్, విధ్వంసం, మానవ అక్రమ రవాణా, మోసానికి సంబంధించి కఠినమైన కేసులు, దొంగతనం లేదా దోపిడీకి సంబంధించి కఠినమైన కేసులు, దారుణ శారీరక హాని వంటి కేసులలో దోషులుగా నిర్ధారించబడిన వారికి కఠినమైన శిక్షను విధించే పక్షంలో యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తారు.తరచుగా, ప్రజలు మరణశిక్షను 14 సంవత్సరాల జైలు శిక్షగా భావిస్తారు జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో గడపడమేనని భారతదేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
హోలీ (సంస్కృతం: होली ) అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో దీన్ని దోల్యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఛత్రపతి షాహు భోంస్లే I (1682–1749 CE) అతని తాత, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా సామ్రాజ్యం ఐదవ ఛత్రపతి. భోంస్లే కుటుంబంలో జన్మించిన అతను పెద్ద కుమారుడు, వారసుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కుమారుడు. అతను చాలా చిన్న వయస్సులోనే బంధించబడ్డాడు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణించే వరకు మొఘలులచే బందీగా ఉన్నాడు.
మొదటి రాజారాం భోస్లే ( 1670 ఫిబ్రవరి 24 - 1700 మార్చి 3, సింహాగడులో ) మరాఠీ పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజు చిన్న కుమారుడు, సంభాజీ మహారాజు సోదరుడు. 1689 లో మొఘలు చక్రవర్తి ఔరంగజేబు చేతిలో తన సోదరుడు మరణించిన తరువాత ఆయన మరాఠీ సామ్రాజ్యాన్ని మూడవ ఛత్రపతిగా పాలించాడు. ఆయన పదకొండేళ్ల పాలన మొఘలులపై నిరంతర పోరాటకాలంగా గుర్తించబడింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
శ్వేతా తివారీ (జననం 4 అక్టోబర్ 1980) భారతదేశానికి చెందిన హిందీ సినిమా, టెలివిజన్ నటి. ఆమె 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచమై స్టార్ ప్లస్ ఛానల్ లో 2001 నుండి 08 వరకు కసౌతీ జిందగీ కే సీరియల్ లో ప్రేరణా శర్మ బసు పాత్ర ద్వారా మంచి గుర్తింపునందుకుంది. ఆమె ఆ తర్వాత పర్వర్రిష్ (2011–2013), బెగుసరాయ్ (2015), మేరే డాడ్ కి దుల్హన్ (2019–2020) వంటి అనేక ధారావాహికలలో నటించింది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా 2018 సెప్టెంబర్ 14న ఓ దుండగుడు మాటువేసి ప్రణయ్ను నరికి చంపాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకు కారణం కులాంతర వివాహమేనని, ప్రణయ్ భార్య అమృత తండ్రి తిరునగరి మారుతీరావు ఈ హత్య చేయించాడని నల్గొండ ఎస్పీ రంగనాథ్ చెప్పారు.
ప్రత్యర్థి వారీగా భారత క్రికెట్ జట్టు రికార్డు
భారత జాతీయ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) హోదాతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో పూర్తి స్థాయి సభ్యురాలు. వారు మొదటిసారిగా 1932లో మూడు రోజుల టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో ఆడినప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన అంబటి రాయుడు (Ambati Thirupathi Rayudu) క్రికెట్ క్రీడాకారుడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్లో డబుల్ సెంచరీ, సెంచరీ పూర్తిచేశాడు.
పెళ్ళి చేసి చూడు (1988 సినిమా)
డ్పెళ్ళిచేసి చూడు 1988 లో విడుదలైన తెలుగు సినిమా. కౌసల్య పిక్చర్స్ పతాకంపై బి. కౌసల్య నిర్మించింది రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
షహాబుద్దీన్ ముహమ్మద్ షాహ్ జహాఁ పూర్తి పేరు అల్ హజ్రత్ అబుల్-ముజాఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్ షాజహాన్ (బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్-ఖాఖాన్ అల్-ముకర్రం, అబుల్-ముజఫ్ఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్, సాహిబే ఖిరానే సాని, షాహ్ జహాఁ I పాద్షాహ్ గాజి జిల్లు'ల్లాహ్ [ఫిర్దోస్-ఆషియాని]) (ఇంకనూ షాహ్ జహాఁ, షాజెహాన్, షాజహాన్, షాజహాను అని కూడా పలుకుతారు. (ఉర్దూ : شاه جهان), జననం జనవరి 5, 1592 ; మరణం జనవరి 31, 1666. మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి, 1628 నుండి 1658 వరకూ భారతదేశాన్ని పరిపాలించాడు.
ఛావా 2025లో విడుదలైన హిందీ చారిత్రక యాక్షన్ సినిమా. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఛావా ఆధారంగా మరాఠా సామ్రాజ్యం రెండవ పాలకుడు శంభాజీ కథాంశంతో నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
సుజాత దీక్షిత్ తెలుగు నాటకరంగ, టీవీ, సినిమా నటి, వ్యాఖ్యాత. పలు టీవి ఛానళ్ళలోనూ, స్టేజీల మీద వివిధ కార్యక్రమాలకు, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుజాత, వి6 న్యూస్ ఛానల్లో ప్రసారమవుతున్న తీన్మార్ వార్తలు కార్యక్రమంలో చంద్రవ్వ పాత్రతో గుర్తింపు పొందింది. 2023లో తెలంగాణ ప్రభుత్వం నుండి నాటకరంగంలో తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (విధాన పరిషత్), ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థలోని సభలలో ఎగువసభ. 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది.
సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. ఐరోపా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం , నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి.