The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మనోజ్ కుమార్ భారతిరాజ ( 1976 సెప్టెంబరు 11- 2025 మార్చి 25) తమిళ సినిమా నటుడు దర్శకుడు. ఆయన ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు. మనోజ్ 1999లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు మనోజ్ భారతి రాజా నటించిన సినిమాలలో సముద్రం (2001), కడల్ పూక్కల్ (2001) అల్లీ అర్జున (2002), వరుశమెల్లం వసంతం (2002) ఈరా నీలం (2003), అన్నకోడి (2013), బేబీ (2015), మానాడు (2021), విరుమన్ (2022) సినిమాలు ఆయనకు మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
జమదగ్ని 1988 జూలై 16న విడుదలైన భారతీయ తెలుగు-భాష యాక్షన్ చిత్రం, ఘట్టమనేని కృష్ణ, కైకాల సత్యనారాయణలు ఒక జిత్తులమారి రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా పోరాడే పాత్రికేయుని పాత్రలలో నటించారు. రాధ కథానాయికగా నటించగా, సుమలత, చారు హాసన్, గొల్లపూడి మారుతీరావు, కాకినాడ శ్యామల ఇతర సహాయక పాత్రలు పోషించారు. భారతీరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.
ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. భార్గవ్ ఆర్ట్స్ పతాకం మీద కొన్ని చిత్రాలు (మనిషికో చరిత్ర, చిలిపిమొగుడు, ముక్కుపుడక) నిర్మించిన ఎస్.గోపాలరెడ్డి, తమిళంలో విజయవంతమైన భారతీరాజా చిత్రం 'మణ్ వాసనై' (మట్టి వాసన) ను తెలుగులో బాలకృష్ణను కథానాయకునిగా పునర్నిర్మించారు. తాతమ్మ కల (బాలనటునిగా బాలకృష్ణ తొలిచిత్రం) కాంబినేషన్ గుర్తు చేస్తూ భానుమతి, బాలకృష్ణ తాతమ్మగా ఈ చిత్రంలో నటించారు.
సార్ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్, సంయుక్త మీనన్, సాయికుమార్, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజర్ను 2022 జులై 28న విడుదల చేసి, సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అనంతిక సనిల్కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్స్టాగ్రామ్తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
రాజాచంద్ర (01-05-1950. 30-101987) జన్మ నామం:చెక్కా వేంకటేశ్వరరావు ఇతర పేర్లు:రాజా చంద్ర జన్మస్థలం:-ఇంకొల్లు, ప్రకాశం జిల్లా పుట్టిన తేదీ:-01,మే1950 మరణం:30,అక్టోబర్1987 మొదటి భార్య:అంజనీ కుమారి పిల్లలు:ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు రెండవ భార్య:కృష్ణవేణి(నటి). వృత్తి: దర్శకుడు పనిచేసిన కాలం:1978నుండి 1987వరకు కుటుంబ కథా చిత్రాలు రూపొందించడంలో ప్రతిభ ఉన్న సినిమా దర్శకులలో ఒకరైన రాజాచంద్ర ప్రకాశం జిల్లా ఇంకొల్లు లో 01మే1950లో జన్మించారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం, తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు SMFs ఆర్థిక అవసరాలకు అనుగుణంగా PM-KISAN పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
భారత ప్రధాన మంత్రి, భారత ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహకుడుగా, కేంద్రమంత్రుల మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. భారత రాష్ట్రపతి రాజ్యాంగ, నామమాత్ర, ఉత్సవ సంబంధమైన దేశాధినేత అయినప్పటికీ, ఆచరణలో సాధారణంగా, కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రి, వారు ఎన్నుకున్న మంత్రుల మండలికే ఉంటుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ప్రధాన శాసనమండలి అయిన లోక్సభ, భారత పార్లమెంటు దిగువసభలో మెజారిటీతో పార్టీచే ఎన్నుకోబడిన నాయకుడు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు.
పుట్టపాగ మహేంద్రనాథ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాగర్కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశాడు. మహేంద్రనాథ్ సేవలకు గుర్తింపుగా కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి వెళ్లే ప్రాంతాలను కలిపే జిల్లా కేంద్రంలోని నాగర్కర్నూల్ కూడలి కొల్లాపూర్ చౌరస్తాకు మహేంద్రనాథ్ చౌరస్తాగా నామకరణం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారటి ఫుల్మాలి (జననం 1994 నవంబరు 10) విదర్భ మహిళల క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 13 సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ ఆడుతోంది, 17 సంవత్సరాల వయస్సులో ఆమె సీనియర్ గా అరంగేట్రం చేసింది. 2019 జనవరిలో, ఆమె 2018–19 సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీ కోసం ఇండియా బ్లూ జట్టులో ఎంపికైంది.
కందుకూరి శివానంద మూర్తి ( 1928 డిసెంబరు 20 - 2015 జూన్ 10) మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. అతను 1928 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఉర్లాం, దేవాది గ్రామాలకు చెందిన బ్రాహ్మణ జమీందారు కుటుంబంలో జన్మించారు. అతని చిన్ననాటి నుండి, ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగ శాస్త్రాల పట్ల గాఢంగా ఆకర్షితుడయ్యాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడానికి వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్బాబు, మోహన్లాల్, శివరాజ్కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.