The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
పెళ్ళి తరువాత భార్యాభర్తలు అనివార్య కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకోవడాన్ని విడాకులు గా పిలుస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాలలో విడాకులు ఎక్కువగా జరుగుచున్నవి. విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది.వివాహాల సమయంలోనే ముందస్తు విడాకుల పిటిషన్లు దాఖలవుతున్నాయి.భాగస్వామికి కుష్టు, మానసిక అనారోగ్యం లాంటి వ్యాధులున్నాయనే కారణాలపై విడాకులు ఇవ్వవచ్చు.వీటిని కొన్ని జంటలు దుర్వినియోగం చేస్తున్నాయి.'పాత రోజుల్లో మన తాత, ముత్తాతలకు ఇలాంటి సమస్యలు లేవు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం. భారతదేశంలోని విష్ణువు ఎనిమిది పవిత్ర స్థలాలలో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. కొండపైన, దిగువన ఉన్న మూడు దేవాలయాలు ఉన్నాయి.
శ్యాంప్రసాద్ ముఖర్జీ, (1901, జూలై 6) ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్ , , పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి. కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి భారత ప్రభుత్వ జీవ వైవిధ్య చట్టం, 2002 (Biological Diversity Act, 2002) కింద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన చట్టబద్ధమైన, స్వతంత్ర సంస్థ. ఆంధ్రప్రదేశ్లోని వివిధ పర్యావరణ వ్యవస్థలు, ఆవాసాలు; రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న వృక్షజాతులు, జంతుజాతులు, ప్రత్యేకమైన జీవవైవిధ్యాన్ని కాపాడటం మండలి ప్రధాన లక్ష్యం. జీవవైవిధ్య వనరుల సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
కాశ్మీర్ శైవం అనేది అనేక అద్వైత శైవ-శాక్తేయ తాంత్రిక, ఏకత్వ మత సంప్రదాయాల నుండి ఉద్భవించిన సంస్కృత వ్యాఖ్యాన సాహిత్యానికి 20వ శతాబ్దంలో ఇచ్చిన ఉమ్మడి పేరు. దీనిని తరచుగా త్రిక సంప్రదాయం లేదా "గుర్తింపు తత్వశాస్త్రం" (ప్రత్యభిజ్ఞ) అని కూడా పిలుస్తారు. క్రీ.శ 850 తర్వాత కాశ్మీర్ లోయలో ఈ సంప్రదాయాలు ఉద్భవించాయి.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
కార్తికేయ గుమ్మకొండ, దక్షిణాది చిత్రాలతో పేరొందిన నటుడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్ 100 తో తన మొదటి విజయం సాధించడమే కాక తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. హీరో నాని నటించిన నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా నటించడమే కాక, గుణ 369, 90ఎంఎల్ చిత్రాల ద్వారా కమర్షియల్ హీరోగా కూడా మంచి విజయాలు సాధించాడు.
అంబ్ ఆలయం (ఉర్దూ: امب مندر)ను స్థానికంగా అంబ్ షరీఫ్ (ఉర్దూ: امب شریف; "నోబుల్ అంబ్") అని పిలుస్తారు, ఇది పాకిస్తాన్ పశ్చిమ భాగాన ఉన్న సకేసర్ పర్వతంపై గల పురాతన హిందూ దేవాలయ సముదాయంలో భాగం. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉంది. ఈ ఆలయ సముదాయం 7 నుండి 9 శతాబ్దాల మధ్య కాలంలో హిందూ షాహీ సామ్రాజ్యం పాలనలో నిర్మించబడింది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 19న జరిగిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై అత్యాచారం హత్య ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు సీబీఐ విచారణకు మారగా, విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.
సర్ఫరాజ్ నౌషాద్ ఖాన్ (జననం 22 అక్టోబర్ 1997) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశీయ క్రికెట్లో ముంబై తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సర్ఫరాజ్ 2014, 2016లో ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
పీర్ల పండుగ అనేది కర్బలా యుద్ధాన్ని స్మరించుకునే ఉత్సవంగా, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ముస్లింలచే జరుపబడే సంతాప పర్వదినం. ఈ పండుగ అషుర్ఖానాలుగా పిలువబడే సూఫీ పుణ్యక్షేత్రాల్లో సంతాప కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుతుంది. మొహర్రం సందర్భంలో, ఆలంలు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ పండుగలో ముఖ్య ఘట్టంగా ఉంటుంది.ఊరేగింపులో విభిన్న కుటుంబాలు, వ్యక్తులు విరాళంగా ఇచ్చిన అనేక ఆలంలు భాగస్వామ్యం అవుతాయి.ఉదాహరణకు, తెలంగాణలోని నరసర్లపల్లె వంటి కొన్ని గ్రామాల్లో, ఒకే కుటుంబం తరతరాలుగా ఆలంలను విరాళంగా అందిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
'రోజులు మారాయి' తెలుగు సాంఘిక చలన చిత్రం1955 ఏప్రిల్ 14 న విడుదల.సారధి పిక్చర్స్ పతాకంపై నిర్మాత సి వి.ఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, వహీదా రెహమాన్ ముఖ్య పాత్రలు పోషించారు.తాపీ చాణక్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సాంఘీక చిత్రాలలో ఓ మైలురాయిగా నిలిచింది.ఈ చిత్రంలో వహీదా రెహమాన్ మీద చిత్రించిన ఏరువాక సాగారోరన్న చిన్నాన్న పాట సూపర్ హిట్ గా నిలచింది . ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు . తమిళంలో1956 లో కాలం మారి పోచి పేరుతో రీమేక్ చేయబడింది.
అనుప్రియా పటేల్ (జననం 1981 ఏప్రిల్ 29) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె లోక్సభలో 2014 నుండి మీర్జాపూర్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుత మోడీ మంత్రిత్వ శాఖలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి .ఆమె 2016 నుండి 2019 వరకు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఉన్నారు.
ప్రశాంత్ కిశోర్ (జననం:1977) భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త. జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ప్రశాంత్ కిషోర్ను పౌరసత్వ సవరణ చట్టం (2019) పై, పార్టీ అధిపతి అయిన నితీష్ కుమార్ అవలంబించిన అనుకూల వైఖరిని విమర్శించినందుకు గాను ఆయనను 2020 జనవరి 29న పార్టీ నుండి బహిష్కరించారు. ప్రారంభంలో ప్రజారోగ్యంలో శిక్షణ పొందిన కిషోర్, భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
సంవత్సరాల వారీగా విడుదలైన తెలుగు సినిమాల జాబితా
{{|width= 100% cellpadding="1" style="float: right; border: 10px solid #996600; background: #ffcc00; padding: 2px; font-size: 120%; margin: 50px 10px 0 0;"
స్వాతంత్ర్య పూర్వ భారతదేశంలో ఒక స్థానిక రాజ్యాన్ని గానీ సంస్థానాన్ని గానీ, తమకు సామంతులుగా మార్చుకునేందుకు ఫ్రెంచి వారు, ఆ తరువాత బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రయోగించిన కూటనీతి, సైన్య సహకార ఒప్పందం. సైన్య సహకార ఒప్పందం వ్యవస్థకు ఆద్యుడు ఫ్రెంచ్ గవర్నర్ జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే. 1740 ల చివరలో అతడు హైదరాబాద్ నిజాంతోను కర్ణాటిక్ తోనూ ఈ ఒప్పందాలు చేసుకున్నారు.
హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ సరస్సు ప్రక్కన 36 ఎకరాలలో ఒక చిన్న పబ్లిక్, పట్టణ ఉద్యానవనమైన ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది. 1999 నుంచి ఇది అనేక దశలలో నిర్మితమైంది, ఇది భౌగోళికంగా నగరం మధ్యలో ఉన్న ఒక ప్రధాన ఉద్యానవనం,, బిర్లా మందిర్, నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్ వంటివి దీనికి దగ్గరగా ఉన్న ఇతర పర్యాటక ఆకర్షణలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనల క్రింద విధులు పాటించే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ద్వారా నిర్వహించబడుతుంది.