The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
హరి గౌర భారతదేశానికి చెందిన సంగీతదర్శకుడు, గిటారిస్ట్, గాయకుడు, గీత రచయిత. ఆయన 2013లో కన్నడ సినిమా చార్మినార్తో సినీ సంగీత దర్శకుడిగా అరంగ్రేటం చేసి 2013లో తుంగభద్ర సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 2015లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమాకుగాను 2015 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్లో సంవత్సరపు ఉత్తమ కంపోజర్ అవార్డును అందుకున్నాడు.
గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.
అనంతిక సనిల్కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్స్టాగ్రామ్తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
హరి శివరాం రాజ్ గురు (1908 ఆగస్టు 24 - 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమకారుడు.. ఇతను భగత్ సింగ్, సుఖ్దేవ్ ల సహచరునిగా గుర్తింపు పొందాడు. 1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందుకు గాను 1931 మార్చి 23న భగత్సింగ్, సుఖ్దేవ్ లతో పాటు ఉరితీసారు.
నగర-రాజ్యం లేదా నగర రాజ్యం లేదా నగరరాజ్యం అంటే చుట్టుపక్కలి ప్రాంతాలకు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా మసలే ఒక స్వాతంత్ర్య, సార్వభౌమ నగరం. చరిత్ర మొదలైన నాటి నుండి ఇలాంటి నగరాలు ప్రపంచంలో చాలా మూలల్లో ఏర్పడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి గ్రీకు పొలిస్లు ఐన ఎథిన్స్, స్పర్టాలు, ఆధునిక టూనిస్యలో ఒకప్పుడు ఉన్న కార్థిజ్, రోము, కొలంబ్య పూర్వ మెక్సికోలో ఆల్టెపేౘ్లు , మధ్యయుగపు ఇటలీలోని ఫ్లొరన్స్, వెనిస్, జెనోవ, మిలాన్లు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
సాహిత్యం (లాటిన్ litterae నుండి (బహువచనం) అక్షరం) అనేది రచనల చేసే ఒక కళ, ఇది ప్రచురించబడిన వనరులకు మాత్రమే పరిమితం కాదు (అయితే, కొన్ని పరిస్థితుల్లో వాటిని మినహాయించవచ్చు). సాధారణంగా చెప్పాలంటే, సాహిత్యం అనే పదానికి అర్థం "అక్షరాలతో సాన్నిహిత్యం" ("కళలు , అక్షరాలు"లో వలె). రెండు ప్రాథమిక రచనా సాహిత్య వర్గాల్లో కల్పన , కల్పనేతర వర్గాలు ఉన్నాయి.
జయరామ్ సుబ్రమణ్యం, (జననం 1965 డిసెంబరు 10) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు, చెండా పెర్కషన్ వాద్యకారుడు, మిమిక్రీ కళాకారుడు, గాయకుడు. ఆయన 2011లో పద్మశ్రీ పురస్కారం, రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఒక తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్తో సహా పలు అవార్డులను అందుకున్నాడు.
చెన్నై నగరం, తమిళనాడు రాష్ట్ర రాజధాని, సదరన్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం. నగరంలోని క్లిష్టమైన స్థానిక, ప్రాంతీయ రైల్వే నెట్వర్క్ లోని భాగంగా అనేక రైల్వే స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను, రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు నగరంలో ప్రధాన రైల్వే కేంద్రాలుగా ఉన్నాయి.
కొరియన్ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ను జులై 13న, ట్రైలర్ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.
జీవ ఇంధనం, అనేది జీవ ద్రవ్యాలనుండి ఉత్పత్తి కావింపబడు ఇంధనం.జీవద్రవ్యం లేదా జీవపదార్ధం అనేది జీవులనుండి ఏర్పడు లేదా ఉత్పత్తి కావించు పదార్ధం.ముఖ్యంగా జంతువుల కన్న మొక్కల నుండి ఏర్పడు, లేదా ఉత్పత్తి కావించు జీవద్రవ్యం పరిమాణం ఎక్కువ. జీవద్రవ్యం అనేది సులభంగా తక్కువ కాలవ్యవధిలో పునరుత్పత్తి కావించు అవకాశమున్న సేంద్రియ పదార్ధం. జీవద్రవ్యం నుండి ఉష్ణరసాయనిక చర్య లేదా జీవరసాయనిక చర్య వలన ఘన, ద్రవ లేదా వాయు జీవఇంధనాలను ఏర్పరచ వచ్చును.
2004వ సంవత్సరంలో 121 అచ్చ తెలుగు చిత్రాలు, 57 అనువాద చిత్రాలు విడుదలైయ్యాయి. ఈ యేడాది 'లక్ష్మీనరసింహా', 'వర్షం', 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్..', 'మాస్', చిత్రాలు సూపర్హిట్స్గా నిలిచాయి. "అంజి, మల్లీశ్వరి, నేనున్నాను, ఆనంద్, 7జి బృందావన్ కాలని, ఆ...నలుగురు, సాంబ, ఘర్షణ" శతదినోత్సవాలు జరుపుకోగా, "వెంకీ, అడవిరాముడు, లీలామహల్ సెంటర్" సక్సెస్ఫుల్ చిత్రాలుగా నిలిచాయి.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.
ఆవశ్యక నూనెలు (ఆంగ్లం: Essential Oils) అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు నూనెలు. ఆవశ్యక నూనెలలో అత్యధిక భాగం మొక్కల/చెట్ల భాగాలనుండి అనగా ఆకులు, వేర్లు, కాండం ల బెరడు, కాండం, పూమొగ్గలు, పూలరెమ్మలు, పళ్ల పైనున్న తొక్కలు (peels/skins) వంటి వాటిలో లభించును. అతితక్కువగా కొన్ని రకాల ఆవశ్యక నూనెలను విత్తానాల నుండి తీయుదురు.