The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మానవ పాపిల్లోమా వైరస్ (human papillomavirus - HPV) మానవుల చర్మం, శ్లేష్మ పొరలకు సంక్రమించే పాపిల్లోమా వైరస్ (papillomavirus) వీటిలో సుమారు 130 HPV రకాలు ఉన్నాయి. కొన్ని వైరస్ రకాలు ఉలిపిరి కాయలు (warts లేదా verrucae) కలిగిస్తే మరికొన్ని కాన్సర్ (cancer) వ్యాధిని కలిగిస్తాయి.అధికంగా (HPV) అంటురోగాలకు లక్షణాలు ఏమి ఉండవు .మానవ పాపిల్లోమా వైరస్(human papillomavirus - HPV),మానవ పాపిలోమా వంశానికి చెందిన డిఎన్ఏ విషక్రిమి(DNA virus ), వల్ల మానవ పాపిల్లోమా అంటువ్యాధి వస్తుంది .చిన్న వయస్సులో లింగసాంగత్యం,పొగతాగటం,అనేక భాగస్వాములు కలిగివుడటం,రోగనిరోధక శక్తి పనితీరు తగ్గిపోవడం దీని లక్షణాలు.అప్పుడప్పుడు గర్భధారణ సమయంలో,HPV తల్లి నుంచి పిల్లలికి రావచ్చు.HPV లింగసాంగత్యం జరిగినప్పుడు జననమండలం (reproductive system) వద్ద చర్మా తాకిడి వాళ్ళ వ్యాపిస్తుంది.ఇది సహజాంగా అంటే మరుగుదొడ్లు,ఇతర తాకిడి వల్ల వ్యాపించదు.ఒక వ్యక్తిక ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల HPV కి గురికావచ్చు.HPV మనుషులకు మాత్రమే వస్తుంది. HPV టీకాలు అత్యంత సాధారణ రకాలైన సంక్రమణను నివారించవచ్చు.ప్రభావవంతంగా ఉండటం కోసం,సంక్రమణ వచ్చే ముందు వాడాలి,అందుకు తొమ్మిది, 13 ఏళ్ళ మధ్యలో సిఫారసు చేయబడాలి.పాపనికోలౌ పరీక్ష (పాప్) లేదా ఎసిటిక్ యాసిడ్ను ఉపయోగించి గర్భాశయ చిత్రీకరణని చూడటం వంటి గర్భాశయ క్యాన్సర్ చిత్రీకరణ పద్ధతి,ప్రారంభ క్యాన్సర్ లేదా అసాధారణ కణాలను గుర్తించవచ్చు.ఇది మెరుగైన ప్రారంభ చికిత్సకి అనుమతిస్తుంది.చిత్రీకరణ అభివృద్ధి చెందిన ప్రపంచంలో గర్భాశయ క్యాన్సర్ వళ్ళ వచ్చే మరణాల సంఖ్యను తగ్గింది.గడ్డకట్టడం ద్వారా పులిపెరలు తొలగించవచ్చు.
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (దీనిని ఐపీఎల్ 2024 లేదా ఐపీఎల్ 18 అని కూడా పిలుస్తారు) ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 18వ సీజన్. ఐపీఎల్ 2025 మార్చి 14న మొదలై మే 25న ముగుస్తుంది. భారత్ - పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ మే 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2025 సీజన్ను నిరవధికంగా వాయిదా వేసింది.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గూగుల్ ఎల్.ఎల్.సి అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్, మైక్రోసాఫ్ట్తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
రొమేనియా లేక రొమానియా (పురాతన ఉఛ్ఛారణలు: రుమానియా, రౌమానియా) ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశము. దేశప్రధాన సరిహద్దు దేశాలలో ఉత్తరాన ఉక్రెయిన్, దక్షిణాన బల్గేరియా, తూర్పున మోల్డోవా, పశ్చిమాన హంగేరీ, సెర్బియాలు ఉన్నాయి.దేశం నల్లసముద్రం తీరంలో ఉంది.దేశవైశాల్యం 238397 చ.కి.మీ. దేశంలో టెంపరేట్ కాంటినెంటల్ వాతావరణం ఉంటుంది.
మానవ పరిణామం అనేది, శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల ఆవిర్భావానికి దారితీసిన పరిణామ ప్రక్రియ. ఇది ప్రైమేట్స్ పరిణామ చరిత్రతో, ప్రత్యేకించి హోమో జాతి పరిణామ చరిత్రతో మొదలై, హోమినిడ్ కుటుంబం లోనే గొప్ప జాతిగా హోమో సేపియన్స్ జాతి ఆవిర్భవించడానికి దారితీసింది. రెండు కాళ్ళపై నడక, భాష వంటి లక్షణాల అభివృద్ధి ఈ ప్రక్రియలో భాగం.
గుప్త సామ్రాజ్యము భారతదేశంలోని ఒక హిందూ సామ్రాజ్యం (సంస్కృతం:samskrutam: गुप्त राजवंश, గుప్త రాజవంశం) గుప్త వంశపు రాజులచే సుమారు సా.శ.280 నుండి సా.శ.550 వరకు పాలించబడింది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్,రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. పాటలీపుత్ర (ప్రస్తుత బీహారు రాజధాని పాట్నా) వీరి రాజధానిగా ఉంది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
మిస్ వరల్డ్ 2025, అనేది మిస్ వరల్డ్ పోటీ 72వ ఎడిషన్ .చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఈవెంట్ ముగింపులో ఎన్నికైన వారిని తన వారసురాలిగా పట్టాభిషేకం చేస్తుంది. హైదరాబాదులో 2025 మే 7 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ అందాల పోటీలలో 120 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. థాయ్లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నది.
కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) ( November 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడిలో పుట్టాడు) భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు 1952 నుండి అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో పూర్తి సభ్యునిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నియంత్రిస్తుంది. టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ (వన్డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20) ఫార్మాట్లలో PCB గానీ, ఇతర ప్రాంతీయ లేదా అంతర్జాతీయ క్రికెట్ సంస్థలు గానీ నిర్వహించే క్రికెట్ పర్యటనలు, టోర్నమెంట్లలో పాకిస్తాన్ పోటీపడుతుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
బ్రహ్మపుత్ర (Brahmaputra river) (అస్సామీ భాష: ব্ৰহ্মপুত্ৰ, బెంగాలీ భాష: ব্রহ্মপুত্র} హిందీ భాష: ब्रम्हपुत्र, టిబెటన్ భాషཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం. టిబెట్లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నదిగా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.
డేవిడ్ ఆండ్రూ వార్నర్ (జననం 1986 అక్టోబరు 27) ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటరు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆస్ట్రేలియన్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్, మాజీ టెస్టు వైస్ కెప్టెన్. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటరు. వార్నర్ 132 సంవత్సరాలలో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అనుభవం లేకుండా ఏ ఫార్మాట్లోనైనా జాతీయ జట్టుకు ఎంపికైన మొట్ట మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్.
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్వవసాయ భూముల నిర్వహణకు కోసం భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, హైదరాబాదు లోని శిల్పకళా వేదిక , హైటెక్ సిటీ, మాదాపూర్ లో తేది:14 ఏప్రిల్ 2025 న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భూపరిపాలనలోని ధరణి స్థానంలో కొత్త ఆర్.ఓ .ఆర్ చట్టం భూ భారతి పొర్టల్ -2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఆస్తిమూరెడు ఆశ బారెడు, తెలుగు చలన చిత్రం,1995 జనవరి26 విడుదల . కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శోభన్ బాబు,జయసుధ, కోడి రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం రాజ్ కోటి సమకూర్చారు. డబ్బు సంపాదన కోసం నీతి నిజాయితీలను వదిలేసి చట్టబద్దంకాని పనులు కూడా చేయడానికి వెనుకాడని మధ్యతరగతి జీవుల నేపథ్యం ఈ కథ.
కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.
సాయి సుదర్శన్ (జననం 15 అక్టోబరు 2001) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడాడు. 2019/20లో రాజా పాలయంపట్టి షీల్డ్లో 52.92 సగటుతో 635 పరుగులతో ఆళ్వార్పేట సీసీ అత్యధిక పరుగుల స్కోరర్ నిలిచాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 2021 నవంబర్ 4న టీ20 అరంగేట్రం చేశాడు.
క్రెటేషస్-పాలియోజీన్ విలుప్తి ఘటన
క్రెటేషియస్-పాలియోజీన్ (K-Pg) విలుప్తి ఘటన అనేది, సుమారు 6.6 కోట్ల సంవత్సరాల కిందట భూమ్మీద నాలుగింట మూడు వంతుల వృక్ష, జంతు జాతులు మూకుమ్మడిగా నశించిపోయిన సంఘటన. దీన్ని క్రెటేషియస్-టెర్షియరీ (K–T) విలుప్తి అని కూడా పిలుస్తారు ఈ ఘటన లోనే నేలపై నివసించే డైనోసార్లు అంతరించిపోయాయి. అంతేకాదు, సముద్ర తాబేళ్లు, మొసళ్ళ వంటి కొన్ని ఎక్టోథర్మిక్ జాతులు మినహా, 25 కిలోలకు పైబడి బరువున్న టెట్రాపోడ్స్ ఏవీ బతకలేదు.
థగ్ లైఫ్ 2025లో విడుదలకానున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా సినిమా. రాజ్కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ నిర్మించిన సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అనేది చెన్నై ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ. ఇది 71 ఆసుపత్రులతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్. అదే పేరుతో ఉన్న హాస్పిటల్ చైన్ తో పాటు, ఈ సంస్థ తన అనుబంధ సంస్థల ద్వారా మందుల దుకాణాలు (pharmacies), ప్రాథమిక సంరక్షణ (primary care), రోగనిర్ధారణ కేంద్రాలు (diagnostic centres), టెలిహెల్త్ క్లినిక్ లు (telehealth clinics), డిజిటల్ ఆరోగ్య సేవలను (digital healthcare services)కూడా నిర్వహిస్తోంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు. 2014,2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీ తరపున చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం నుండి పోటిచేసి గెలుపొందాడు. ఇతని తాత కొండా వెంకట రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా పేరు పెట్టారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 శాసనసభను ఏర్పాటు చేయడం కోసం, 2024 మే 13న రాష్ట్రంలో 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2024 భారత సాధారణ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు ఎకకాలంలో జరిగాయి. వోట్ల లెక్కింపు 2024 జూన్ 4న జరిగింది.