The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 19న జరిగిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై అత్యాచారం హత్య ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు సీబీఐ విచారణకు మారగా, విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.
శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 - మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్బాబు, మోహన్లాల్, శివరాజ్కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు. సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా (Maoist) ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.
గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.
వయొలేటా డెల్ కార్మెన్ పర్రా శాండోవల్ (; 4 అక్టోబరు 1917 - 5 ఫిబ్రవరి 1967) చిలీ స్వరకర్త, గాయకురాలు-పాటల రచయిత, జానపద కళాకారిణి, ఎథ్నోమ్యూజికాలజిస్ట్, విజువల్ ఆర్టిస్ట్. చిలీ వెలుపల తన ప్రభావాన్ని విస్తరించే చిలీ జానపద సంగీతం పునరుద్ధరణ, పునరుద్ధరణ అయిన నువా కాన్సియోన్ చిలీనా (చిలీ న్యూ సాంగ్) కు ఆమె మార్గదర్శకత్వం వహించింది. ఆమె పుట్టిన తేదీ (అక్టోబర్ 4) "చిలీ సంగీతకారుల దినోత్సవం"గా ఎంపికైంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో జన్మించిన పి.టి.ఉష 1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి, అందులో చేరింది. ఆ సమయంలో ఆమెకు మాసమునకు కేరళ ప్రభుత్వం చెల్లించిన డబ్బు రూ.250/- 2022లో రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయింది. అంతేకాదు వైస్ ఛైర్పర్సన్స్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
మంత్ ఆఫ్ మధు 2023లో తెలుగులో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. కృషివ్ ప్రొడక్షన్, హ్యాండ్పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్పై యస్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ను 2022 సెప్టెంబర్ 29న విడుదల చేసి, ట్రైలర్ను 2023 సెప్టెంబర్ 26న నటుడు సాయి ధరమ్ తేజ్ విడుదల చేయగా, సినిమాను అక్టోబర్ 06న విడుదల చేశారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
రావు బహదూర్ అనేది వెంకటేష్ మహా రచన, దర్శకత్వం మరియు కూర్పు (ఎడిటింగ్) లో రాబోతున్న ఒక భారతీయ తెలుగు భాష సైకలాజికల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించగా, వికాస్ ముప్పాల, దీపా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో, A+S మూవీస్ మరియు శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
సుందరకాండ 2025లో విడుదలైన తెలుగు సినిమా. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించాడు. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ను ఆగష్టు 26న విడుదల చేశారు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
ప్లవన శక్తి అనేది ఒక వస్తువు ద్రవంలో మునిగినపుడు ఆ వస్తువు యొక్క బరువుకు వ్యతిరేకంగా ద్రవం ఏర్పరిచే బలం.ఒక వస్తువును నీటిలో ముంచినప్పుడు ఆ వస్తువు యొక్క కాలం పైన వున్న దాని కంటే కింద వున్న దాని మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి యొక్క తేడా వలన ఆ వస్తువు యొక్క వేగం పైకి పనిచేస్తుంది. ఆసక్తి యొక్క పరిమాణం పైన, కింద కాలం మద్య ఒత్తిడిలో వున్న తేడా నిష్పత్తిలో వుంటుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
'మాస్టర్ తారా సింగ్' (1885 జూన్ 24, in రావల్పిండి, పంజాబ్ – 1967 నవంబరు 22, చండీఘర్ లో) 20వ శతాబ్ది తొలి అర్థభాగంలోకెల్లా ప్రముఖ సిక్ఖు రాజకీయ, మత నాయకుడు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ నిర్వహణకు, భారత విభజన సమయంలో సిక్ఖుల వైఖరిని మలచడంలో కీలకమైన నాయకుడు. సిక్ఖు మతాధిక్య రాష్ట్రంగా పంజాబ్ ఏర్పాటు కోసం డిమాండ్ కు నేతృత్వం వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
కంప్యూటర్ భద్రత లేదా సైబరు భద్రత లేదా సమాచార భద్రత అనేది కంప్యూటర్, హార్డువేరు, సాఫ్టువేరు లేదా అందులో ఉన్న సమాచారం దొంగిలించ బడకుండా, పాడుచేయకుండా పనిచేసే ఒక రక్షణ వ్యవస్థ. కంప్యూటర్ అందించే సేవలకు అంతరాయం కలిగించడాన్ని, లేదా వాటిని తప్పుదారి పట్టించడాన్ని అడ్డుకోవడం కూడా కంప్యూటర్ భద్రతలో భాగమే. హార్డువేరుకు భౌతిక రక్షణ కల్పించడం, నెట్వర్క్ (వలనడి) ద్వారా వచ్చే ఉపద్రవాలనుంచి వాటిని కాపాడటం, సమాచార, కోడ్ (సంకేత భాష) రక్షణ మొదలైనవన్నీ కంప్యూటర్ భద్రతకు సంబంధించిన అంశాలే.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అనేది ఇంటింటి లెక్కింపు, ముందే నింపిన ఫారాలు, పాత ఓటరు డేటా ధ్రువీకరణ ద్వారా ఓటరు జాబితాలను ధ్రువీకరించడానికి, సవరించడానికి భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ఒక ప్రక్రియ. అర్హులైన పౌరులు తప్పిపోకుండా చూసుకుంటూ, మరణించిన, శాశ్వతంగా మార్చబడిన, నకిలీ, పౌరులు కాని ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా భారతదేశం అంతటా ఓటర్ల జాబితాలు కచ్చితమైనవని నిర్ధారించడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లక్ష్యం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను 2025 అక్టోబరు 27న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించాడు.
హతిజే హైరియే అయ్షే దుర్రూషెహ్వార్ సుల్తాన్ (Hatice Hayriye Ayşe Dürrüşehvar Sultan) (ఒట్టోమన్ టర్కిష్: خدیجه خیریه عائشه درشهوار سلطان, "గౌరవప్రదమైన మహిళ", "ఆశీర్వదించబడినది", "అంగనామణి", "రాజయోగ్యమైన ముత్యం"), వివాహం తరువాత దుర్రూషెహ్వార్ దుర్దానా బేగం సాహిబా, బెరార్ యువరాణి (26 జనవరి 1914 - 7 ఫిబ్రవరి 2006) ఒట్టోమన్ యువరాణి, ఒట్టోమన్ సామ్రాజ్య సింహాసనానికి చివరి వారసుడు, ఒట్టోమన్ ఖిలాఫత్ యొక్క చివరి ఖలీఫా, రెండవ అబ్దుల్మజీద్ యొక్క ఏకైక కుమార్తె.
అంతర్జాతీయ జనాభా దినోత్సవం లేదా ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి ఏటా జూలై 11 వ తేదీన నిర్వహిస్తున్నారు. జనాభా సమస్యల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తుంది, ఇది 1989లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగం. ఆనాటి పాలక మండలిచే ఇది స్థాపించబడింది, ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు పెరుగుదలను.
మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి
మద్దెలచెరువు సూర్యనారాయణ (సూరి) రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు.
ఉక్కు మంత్రిత్వ శాఖ అనేది భారత ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఏజెన్సీ, ఇది భారతదేశంలో ఉక్కు ఉత్పత్తి, పంపిణీ & ధరలకు సంబంధించిన అన్ని విధానాలను రూపొందించడానికి బాధ్యత వహిస్తుంది. ఈ మంత్రిత్వ శాఖకు 2024 జూన్ నాటికి, మంత్రిత్వ శాఖ సెక్రటరీ ర్యాంక్ IAS అధికారి నేతృత్వంలో ఉంటుంది, అతను దాని పరిపాలనా అధిపతి, రాజకీయ అధిపతి క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి హెచ్. డి.
అమీనా హక్ (ఉర్దూ: అమీనా హక్, అమ్నా హక్ అని కూడా పిలుస్తారు) ఒక పాకిస్తానీ మోడల్, నటి. హక్ షీ, లిబాస్, విసేజ్, ఉమెన్స్ ఓన్, ఫ్యాషన్ కలెక్షన్, న్యూస్ లైన్ వంటి మ్యాగజైన్లకు మోడలింగ్ చేశారు. లక్స్ స్టైల్ కి దునియా మూడు సీజన్లకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది, ఆగ్ టీవీ కోసం ఆమినా హక్ షో అని పిలువబడే చాట్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.